గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (11:15 IST)

రోజుకు మూడు అరటిపండ్లు తీసుకుంటే..?

సాధారణంగా చాలామంది ప్రతిరోజూ.. ఉదయం నుండి రాత్రి పడుకునే వరకూ ఎన్నో రకాల పండ్లను తింటుంటారు. కొన్ని పండ్లు ఆయా సీజన్‌లో మాత్రమే దొరుకుతాయి. కాని అన్ని సీజన్‌లలో దొరికేపండు అరటి పండ్లు. అందరికీ అందుబాటు ధరలో ఉంటాయి. చిన్నవారి నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే పండు అంటే అది అరటి పండే. 
 
ఇలాంటి అరటి పండును రోజుకు 3 చొప్పున తీసుకుంటే గుండెపోటుకు చెక్ పెట్టవచ్చనని తాజా అధ్యయనంలో తేలింది. పరిశోధనలో నిర్వహించిన అధ్యయనంలో రోజూ వారి ఆహారంతో పాటు 3 అరటిపండ్లు తీసుకునే వారిలో హృద్రోగ సంబంధిత సమస్యలు రావని వెల్లడించారు. 
 
రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌కు ఒక అరటి పండు, భోజన సమయంలో మరొకటి, రాత్రి డిన్నర్‌కు మూడో అరటిపండును తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన  శరీరంలోని పొటాషియం శాతం తగ్గుముఖం పడుతుంది. అలాగే మెదడు, రక్త సంబంధిత రోగాలను 21 శాతం వరకు నివారించవచ్చునని పరిశోధకులు తేల్చారు. 
 
కాగా, స్పానిష్, నట్స్, పాలు, చేప వంటి పొటాషియంతో కూడిన ఆహారాలను తీసుకోవడం కంటే, మూడు అరటిపండ్లు రోజూవారీగా తీసుకోవడం ద్వారా గుండెపోటు, రక్తపోటు వంటి వాటిని చాలామటుకు తగ్గిపోతుందని వారు చెబుతున్నారు. 
 
పొటాషియం అధికంగా గల ఆహారం తీసుకోవడం ద్వారా సంవత్సరానికి గుండెపోటుతో మరణించేవారి సంఖ్య అధికమవుతుందని వార్వింక్ యూనివర్శిటీ నిర్వహించిన స్టడీలో తేలింది. అయితే రోజూ మూడు అరటి పండ్లు తీసుకోవడం ద్వారా శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గించి, గుండెపోటును నియంత్రించవచ్చునని పరిశోధనలో తేలింది.