సంబంధిత వార్తలు
- ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా కూప్పకూలిన సైనిక విమానం...
- వ్యాక్సిన్ వేయించుకోకపోతే.. ఇండియాకో, అమెరికాకో వెళ్లిపోండి..?
- భారత విమానాలపై నిషేధం పొడగించిన ఫిలిప్పీన్స్
- ఫిలిప్పీన్స్లో కొత్త చట్టం.. లైంగిక సంబంధానికి వయస్సును పెంచారు..
- కోవిడ్-19 లాక్డౌన్: ఫిలిప్పీన్స్లో సంతాన విప్లవం - లక్షల సంఖ్యలో అవాంఛిత గర్భాలు
బీభత్సం సృష్టించిన రాయ్ టైఫూన్ తుఫాను : 75 మంది మృతి
ఫిలిప్పీన్స్ దేశంలో రాయ్ టైఫూన్ తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ధాటికి దాదాపు 75 మందికిపై ప్రజలు మృత్యువాతపడ్డారు. అలాగే, ఆ దేశంలోని అనేక ద్వీపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా అపారమైన ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లింది.
బాధితులను ఆదుకునేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. బాధితులకు నీరు, ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. దక్షిణ, మధ్య ప్రాంతాలను తుఫాను ధ్వంసం చేయడంతో 3 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను, బీచ్ ఫ్రంట్ రిసార్ట్లను వదిలి పారిపోయారు. తుఫాను కారణంగా అనేక ప్రాంతాల్లో కమ్యూనికేషన్లు, విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. ఇళ్ళపై పైకప్పులు కూలిపోయాయి.
తర్వాతి కథనం
