1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. At Least 75 Dead In Philippines Super Typhoon, Rescue Ops Continue

బీభత్సం సృష్టించిన రాయ్ టైఫూన్ తుఫాను : 75 మంది మృతి

Philippines
ఫిలిప్పీన్స్ దేశంలో రాయ్ టైఫూన్ తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ధాటికి దాదాపు 75 మందికిపై ప్రజలు మృత్యువాతపడ్డారు. అలాగే, ఆ దేశంలోని అనేక ద్వీపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా అపారమైన ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లింది. 
 
బాధితులను ఆదుకునేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. బాధితులకు నీరు, ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. దక్షిణ, మధ్య ప్రాంతాలను తుఫాను ధ్వంసం చేయడంతో 3 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను, బీచ్ ఫ్రంట్ రిసార్ట్‌లను వదిలి పారిపోయారు. తుఫాను కారణంగా అనేక ప్రాంతాల్లో కమ్యూనికేషన్లు, విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. ఇళ్ళపై పైకప్పులు కూలిపోయాయి. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
దేశంలో బాగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు