1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 18 జూన్ 2020 (17:13 IST)

184 దేశాలకు మోడీ కృతజ్ఞతలు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌ తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికైంది. ఈ ఎన్నికల్లో భారత్‌కు మద్దతుగా నిలిచిన 184 దేశాలకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు.

బుధవారం రాత్రి ఎన్నికల్లో 193 దేశా ఓట్లు పోల్‌ కాగా, భారత్‌ 184 ఓట్లతో విజయం సాధించింది. ఈ విజయం భారత్‌కు ఇండియాకు గొప్ప పరిణామమని మోడీ పేర్కొన్నారు. భారత్‌కు మద్దతిచ్చిన దేశాలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.

పోటీ లేకుండానే భారత్‌ను గెలిపించారని, తమ దేశానికి దక్కిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని, సభ్య దేశాలతో కలిసి పని చేస్తామని అన్నారు.

ప్రపంచంలో శాంతిని నెలకొల్పడం, సామరస్యం, భద్రత, సమానత్వం తదితర హక్కుల కోసం తమ పంథాను కొనసాగిస్తామని మోడీ చెప్పారు.
 
తాత్కాలిక సభ్య దేశంగా ఎనిమిదోసారి..
ఆసియా-పసిఫిక్‌ విభాగంలో 2020-21 కాలానికి అధిక మద్దతుతో ఎనిమిదోసారి గెలుపొందింది. 193 మంది సభ్య దేశాలున్న ఐరాస జనరల్‌ అసెంబ్లీలో 184 ఓట్లతో విజయం సాధించింది. దీంతో ఏకగ్రీవంగా భారత్‌ ఈ ఎన్నికల్లో గెలిచినట్లయింది.

భారత్‌తో పాటు ఐర్లాండ్‌, మెక్సికో, నార్వేలు కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించాయి. గతేడాది జూన్‌లో చైనా, పాకిస్తాన్‌తో సహా 55 దేశాలు ఆసియా-పసిఫిక్‌ విభాగానికి ప్రతినిధిగా భారత్‌ అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయి.

గతంలో భారత్‌ 1950-51, 1967-68, 1972-73, 1977-78, 1984-85, 1991-92తో పాటు 2011-12లో కూడా ఎన్నికైంది.