సంబంధిత వార్తలు
- విస్తరణవాదం వైపు ప్రపంచం మొగ్గు.. భారత్ మాత్రం వ్యతిరేకం : ప్రధాని మోడీ
- ఏది నిజం.. ఏది అబద్ధం : డిసెంబర్ 1 నుంచి మళ్లీ లాక్డౌన్
- అమెరికా కొత్త అధినేతలకు మోడీ - చంద్రబాబు శుభాకాంక్షలు
- సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ జయంతి: ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని మోడీ
- ఆరోగ్య వన్ - సర్దార్ పటేల్ జూను ప్రారంభించిన ప్రధాని మోడీ
పాకిస్థాన్పై నిప్పులు చెరిగిన మోదీ.. కొన్ని దేశాలు ఇంటి దొంగ వంటివి..?
narendra modi
ప్రస్తుత పరిస్థితుల్లో ఉగ్రవాదం ప్రపంచంలో అతిపెద్ద సమస్య అని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే, నిధులు సమకూర్చే అన్ని దేశాలను జవాబుదారీ చేయాలన్నారు. మోదీ వ్యాఖ్యలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమర్థించారు.
12వ బ్రిక్స్ సదస్సు రష్యా అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ వర్చువల్ సమావేశంలో మోదీ మాట్లాడుతూ, మల్టీలేటరలిజం సంక్షోభంలో ఉందన్నారు. అంతర్జాతీయ సంస్థలపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఈ సంస్థలు 75 ఏళ్ల క్రితంనాటి ఆలోచనా ధోరణితో నడుస్తున్నాయని, కాలానుగుణంగా మారడం లేదని అన్నారు.
పాకిస్థాన్ను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఉగ్రవాదమని తెలిపారు. ఉగ్రవాదులకు మద్దతిచ్చే, సహాయపడే దేశాలను కూడా అపరాధులుగా ప్రకటించాలన్నారు. బ్రిక్స్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీని ఖరారు చేయడం గొప్ప విజయమని తెలిపారు.
ఉగ్రవాదంపై మోదీ వ్యాఖ్యలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమర్థించారు. కొన్ని దేశాలు ఇంటి దొంగ వంటివన్నారు. ఉగ్రవాదం, కోవిడ్-19 మహమ్మారి వంటి సమస్యల పట్ల ప్రపంచం అలసత్వంతో వ్యవహరించకూడదన్నారు.
