ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర కాబుల్లో రంజాన్ వేళ మసీదుపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారని ఆఫ్ఘాన్ పోలీసులు తెలిపారు. మరో 15 మందికి గాయాలయ్యాయని చెప్పారు. ఈ పేలుడులో ముస్లిం మతగురువు కూడా మృతి చెందారని పోలీసు ప్రతినిధి ఫెర్డాస్ ఫరామార్జ్ తెలిపారు. మసీదులో ప్రార్థనలు ప్రారంభమయిన వెంటనే ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. అయితే.. ఈ బాంబు దాడికి తామే బాధ్యులం...