శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By వాసు
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (13:44 IST)

యాపిల్ సంస్థ నుండి స్ట్రీమింగ్ వీడియో సర్వీసెస్ రానున్నాయి..

ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ ఈ నెల 25వ తేదీన ఓ స్పెష‌ల్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌నుంది. ఈ మేరకు యాపిల్ తాజాగా ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ స్పెషల్ ఈవెంట్ ఎందుకోసం అనే వివరాలను మాత్రం యాపిల్ వెల్లడించలేదు. కానీ అందులో యాపిల్ త‌న సొంత స్ట్రీమింగ్ వీడియో సర్వీస్‌ను లాంచ్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. ఈవెంట్‌కి సంబంధించి ఇట్స్ షో టైం అనే ట్యాగ్‌లైన్‌ను యాపిల్ జ‌త‌చేసింది. దీన్ని బట్టి చూస్తే యాపిల్ ఖచ్చితంగా వీడియో స్ట్రీమింగ్ సర్వీసెస్‌ను లాంచ్ చేయనుందని తెలుస్తోంది.
 
కాగా ఈ ఈవెంట్‌లో యాపిల్ ఎలాంటి హార్డ్‌వేర్ ప్రొడక్ట్స్‌ను విడుదల చేయడం లేదని సమాచారం. గ‌తేడాది యాపిల్ నెక్ట్స్ ఇష్యూ మీడియాకు చెందిన టెక్ట్చ‌ర్ అనే డిజిట‌ల్ మ్యాగ‌జైన్ స‌ర్వీస్‌ను సొంతం చేసుకోగా, అందుకోసం వినియోగదారుల నుండి నెలకు 10 డాల‌ర్ల స‌బ్‌స్క్రిప్ష‌న్ ఫీజును వసూలు చేస్తోంది. ఈ క్ర‌మంలో స‌ద‌రు చార్జీని ప‌బ్లిష‌ర్ల‌కు రెవెన్యూ రూపంలో యాపిల్ ఇవ్వ‌నుంద‌ని తెలిసింది. ఇక మార్చి 25 ఈవెంట్ యాపిల్ పార్క్ క్యాంప‌స్‌లో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేట‌ర్‌లో భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 10.30 గంట‌ల‌కు ప్రారంభం కానుంది.