శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 17 డిశెంబరు 2018 (08:45 IST)

బుడ్డోడు కాదు.. చిచ్చరపిడుగు... 13 యేళ్ళకే టెక్కీ అయ్యాడు

నేటి యువత డ్రీమ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరడం. ఇందుకోసం అనేక మంది యువతీయువకులు రేయింబవుళ్లు శ్రమిస్తుంటారు. కానీ, ఈ బుడ్డోడు మాత్రం కేవలం 13 యేళ్ళకే టెక్కీ అయిపోయాడు. ఫలితంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మారిపోయాడు. అదీకూడా మరో కంపెనీలో చేరడం కాదు. ఏకంగా తానే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీని పెట్టాడు. అలా టెక్కీ అయిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిద్ధాం. 
 
అవును.. చిచ్చరపిడుగే. లేకపోతే.. 13 ఏళ్లకే సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టడం ఏంటి. అది కాదు అసలు ట్విస్ట్. మరో ట్విస్ట్ ఏంటంటే.. 9 ఏళ్లకే ఆ పిల్లాడు మొబైల్ యాప్‌ను డిజైన్ చేశాడు. షాక్ అయ్యారా? అవును.. ఆ చిచ్చరపిడుగు గురించి తెలుసుకోవాలనుందా.. అయితే రండి.. తెలుసుకుందాం.
 
ఆదిత్య రాజేశ్ అనే 13 యేళ్ళ బాలుడు స్వరాష్ట్రం కేరళ. కానీ.. చిన్నప్పుడే వాళ్ల కుటుంబం దుబాయ్‌కి వెళ్లి స్థిరపడిపోయింది. ఇక.. అక్కడే మనోడికి కంప్యూటర్ అలవాటైంది. బీబీసీ టైపింగ్ అనే ఓ కిడ్స్ వెబ్‌సైట్‌ను తన తండ్రి రాజేశ్‌కు పరిచయం చేశాడు. అలా.. కంప్యూటర్‌పై పట్టు సాధించడం ప్రారంభించాడు. 
 
నెమ్మదిగా కంప్యూటర్ లాంగ్వేజీలను కూడా నేర్చుకోవడం ప్రారంభించాడు. తనే సొంతంగా ఇంటర్నెట్‌లో చూసి నేర్చుకున్నాడు. సాఫ్ట్‌వేర్ లాంగ్వేజీలన్నీ నేర్చుకున్నాక.. బోరు కొడుతుంటే తన తొమ్మిదేళ్ల వయసులో ఏకంగా మొబైల్ అప్లికేషన్‌నే డెవలప్ చేశాడు. అది సక్సెస్ అవడంతో ఇక.. వెనక్కి తిరిగి చూసుకోలేదు రాజేశ్. ఆ తర్వాత వైబ్‌సైట్లను డెవలప్ చేయడం, లోగోలు డిజైన్ చేయడం ప్రారంభించాడు. 
 
అలా.. తన 13 ఏళ్ల వయసులో దుబాయ్‌లో ట్రైనెట్ సొల్యూషన్స్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీని నెలకొల్పాడు. ప్రస్తుతం తన కంపెనీలో ముగ్గురు ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రస్తుతం 12 మంది క్లయింట్లు కూడా ఉన్నారట. కాకపోతే మనోడి వయసు 18 దాటలేదు కదా. అందుకే.. కంపెనీలాగ తన ఎంప్లాయిస్‌తో కలిసి క్లయింట్లకు వర్క్ చేస్తున్నాడట. రాజేశ్.. తన క్లయింట్లకు ఉచితంగా అప్లికేషన్లు డెవలప్ చేసి ఇస్తున్నాడట.