గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 ఆగస్టు 2024 (13:00 IST)

స్నేహితులే పొట్టనబెట్టుకున్నారు.. యువతి ప్రేమ కోసం కత్తితో పొడిచి చంపేశారు... (video)

Engineering student
Engineering student
స్నేహితులే ఆ యువకుడిని పొట్టనబెట్టుకున్నారు. యువతి ప్రేమ విషయంలో ఇంజనీరింగ్ విద్యార్థి దారుణంగా హత్యకు గురైనాడు. బాలాపూర్‌ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మంకు చెందిన శాంతయ్య, అనితకు ప్రశాంత్ ఏకైక పుత్రుడు.  ఎంవీఎస్ఆర్‌ కాలేజ్‌లో ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. 
 
గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో బాలాపూర్‌ గణేశ్‌ చౌక్‌ వద్ద స్నేహితులకు ప్రశాంత్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ముగ్గురు యువకులు ప్రశాంత్‌పై దాడికి పాల్పడ్డారు. అందులో ఒకడు తన వద్ద ఉన్న కత్తితో ప్రశాంత్‌ కడుపులో మూడుసార్లు పొడిచాడు. 
 
ప్రశాంత్‌ రక్తపు మడుగులో పడిపోగానే ముగ్గురు బైక్‌పై పరారయ్యారు. సమాచారం అందుకున్న బాలాపూర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా ప్రశాంత్‌ అప్పటికే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్య చేసి పరారైన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.