గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 4 ఆగస్టు 2024 (12:16 IST)

న్యూయార్కులో అడుగుపెట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనకు బయలుదేరి కొద్దిసేపటి క్రితం న్యూయార్క్ చేరుకున్నారు. 10 రోజుల బిజినెస్ ట్రిప్‌లో భాగంగా రేవంత్ అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించి, తెలంగాణకు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉన్నవారిని కలవనున్నారు.
 
రేవంత్ న్యూయార్క్‌లో టచ్ చేస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో కనిపించాయి. రేవంత్ రెడ్డి కొత్త లుక్‌లో కనిపించారు. 
 
నివేదికల ప్రకారం, తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించడానికి రెడ్డి గూగుల్, అమెజాన్, ఆపిల్, హ్యుందాయ్,ఇతర ఫ్లాగ్‌షిప్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. ఈ పది రోజుల ప‌ర్యాట‌న‌లో భాగంగా సీఎం బృందం పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా రూ. 50 వేల కోట్ల పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా చర్చ‌లు ఉంటాయ‌ని అధికారులు చెబుతున్నారు. ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమల రంగంలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని అంత‌ర్జాతీయ కంపెనీల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు.