1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Sircilla: Youth Leaves Suicide Note On SIR Form Telangana

Sircilla: SIR.. ప్రధాని మోదీ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నాను.. ఎవరు?

suicide
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఓ వ్యక్తిని బలిగొంది. తన మరణానికి ప్రధాని నరేంద్ర మోదీ కారణమని పేర్కొంటూ.. సర్ ఎన్యూమరేషన్ ఫారమ్‌పై రాసిన సూసైడ్ లెటర్‌ను వదిలి వెళ్లాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం, రచర్ల గొల్లపల్లి గ్రామంలో 25 ఏళ్ల యువకుడు బుధవారం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు.  
 
పోలీసులను ఉద్దేశించి రాసిన ఆ లేఖలో, తన పరిస్థితిని వారు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. అలాగే తన మరణానికి తన కుటుంబాన్ని నిందించవద్దని, వారిని ఇబ్బంది పెట్టవద్దని, తన అంత్యక్రియలు సంప్రదాయం ప్రకారం జరగాలని కోరాడు. అతని ఇంట్లో పోలీసులు చేతిరాతతో ఉన్న ఒక లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు చెబుతున్న మృతుడు పెయింటర్‌గా పనిచేసేవాడు. అతనికి మద్యపాన అలవాటు కూడా ఉన్నట్లు సమాచారం. 
 
పోస్టుమార్టం కోసం పోలీసులు మృతదేహాన్ని సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు, ఆ లేఖను పరిశీలించడంతో పాటు, అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై స్పష్టత కోసం అతని కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడుతున్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
50 ఏళ్లు పూర్తి చేసుకున్న మాజా: జాతీయ మామిడిపండు దినోత్సవం సందర్భంగా మామిడి రైతులకు సన్మానం