సంబంధిత వార్తలు
- కన్నడ ఇండస్ట్రీలో విషాదం.. ఇంటిలోనే ఉరేసుకున్న దర్శకుడు...
- టెక్కీ హత్య కేసు : హంతకుడి ఆచూకీ చెబితే రూ.5.7 కోట్ల రివార్డు
- జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక హోదా పునరుద్ధరించండి... అమిత్ షాకు ఒమర్ అబ్దుల్లా వినతి
- 36 సంవత్సరాల తర్వాత క్రికెట్కు ఆతిథ్యమిచ్చిన కాశ్మీర్
- కేంద్రం సంచలన నిర్ణయం : జమ్మూకాశ్మీర్లో రాష్ట్రపతి పాలన రద్దు
హైదరాబాద్లో కాశ్మీర్ టెక్కీ ఆత్మహత్య.. అంతా ప్రేమ వ్యవహారమే
మల్టీ నేషనల్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న 23 ఏళ్ల టెక్కీ మృతదేహం గుల్షన్నగర్లోని ఆమె అపార్ట్మెంట్లో లభ్యమైందని ఫిలింనగర్ పోలీసులు తెలిపారు. బాధితురాలిని జమ్మూ కాశ్మీర్కు చెందిన ఇరామ్ నబిదార్గా గుర్తించారు. నవంబర్ 7వ తేదీ నుంచి ఆమె కార్యాలయంలో లాగిన్ కాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆమె కార్యాలయంలో అనుమానం వచ్చింది. వారు పోలీసులకు సమాచారం అందించారు.
బ్యాంక్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఫ్లాట్ తలుపులు పగులగొట్టి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు ఆమెకు ప్రేమ వ్యవహారం ఉందని, మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడి వుంటుందని పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
