సంబంధిత వార్తలు
- తగ్గిన చలి తీవ్రత - తెలంగాణాలోని ఉత్తరాది జిల్లాల్లో వర్షాలు
- కేసీఆర్ జిల్లాల పర్యటన: షెడ్యూల్ ఖరారు
- 'జవాద్' తుఫాను భయం : మూడు జిల్లాలకు అలెర్ట్ ... మానిటరింగ్ ఆఫీసర్లు
- ఏపీ- తెలంగాణా రాష్ట్రాలలో ఏడవ ఎడిషన్ గిఫ్ట్ వార్మ్ ప్రచారం ప్రారంభించిన రెన్యూ పవర్
- జిల్లాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభించండి: సీఎం జగన్
తెలంగాణలో పలు జిల్లాలకు అదనపు కలెక్టర్ల కేటాయింపు
తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలకు అడిషనల్ కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం... జగిత్యాల అదనపు కలెక్టర్గా జీఎస్ లత, నారాయణ్ పేట్ అదనపు కలెక్టర్గా జి. పద్మజారాణి, రాజన్న సిరిసిల్లా అదనపు కలెక్టర్గా ఖీమా నాయక్ కు పోస్టింగులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.
ఇప్పటికే రాష్ట్రంలో వరుసగా ఐపీఎస్, ఐఏఎస్, అదనపు కలెక్టర్ హోదా, నాన్ కేడర్ అధికారులను బదిలీ చేయడం, వెయిటింగ్లో ఉన్న వారికి పోస్టింగులను ఇస్తోంది.
ఈ నేపథ్యంలో వరంగల్ అదనపు కలెక్టర్ గా కె. శ్రీవాస్తవ, ములుగు అదనపు కలెక్టర్ గా వై.వి. గణేష్, మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్గా ఎం. డేవిడ్ లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
ఇప్పటివరకు నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్గా ఉన్న పీ.శ్రీనివాస్ రెడ్డిని సిద్ధిపేటకు బదిలీ చేశారు. అంతేకాకుండా... బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పాలనాధికారి చంద్రమోహన్ ను కామారెడ్డి అదనపు కలెక్టర్గా బదిలీ చేశారు.
ఛంచల్ గూడ ప్రభుత్వ ముద్రణాలయం పాలనాధికారిగా ఉన్న కె. అనిల్ కుమార్ తో పాటు హైదరాబాద్ జిల్లా భూ పరిరక్షణ ఎన్డీసీగా జీ. సంతోషినిలను ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు పలువురు నాన్ కేడర్ అధికారులను కూడా బదిలీ చేశారు.