1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (22:36 IST)

విద్యార్థినిపై కిరాతక ఆటోడ్రైవర్ అత్యాచారం.. నడిరోడ్డుపై బట్టలు లేకుండా..

తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న కడపలో మహిళపై అత్యాచారం జరుగగా.. తాజాగా రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ స్టూడెంట్‌ను దారి మళ్లించి దారుణం చేశాడు ఓ కిరాతక ఆటోడ్రైవర్.. విద్యార్ధినిపై అత్యాచారం చేసి నడిరోడ్డుపై బట్టలు లేకుండా వదిలిపెట్టేశాడు. సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఇంటికి వస్తుండగా జోడిమెట్లలోని పొదల్లోకి తీసుకెళ్లి విద్యార్థినిపై ఆటో డ్రైవర్ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
 
ఈ క్రమంలోనే అమ్మాయిని వివస్త్రను చేసి రోడ్డుపై వదిలేసి ఆటో డ్రైవర్ పరారయ్యాడు. స్థానికులు అమ్మాయిని రక్షించి మేడిపల్లిలో క్యూర్ హాస్పిటల్‌కి తరలించారు. ఘట్కేసర్ పోలీసులు బాధిత యువతి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని ఆటోడ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ ఘటనకు ఆటో డ్రైవర్ ఒక్కరే కారణమా? అతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.