శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (07:47 IST)

తెలంగాణ రాజ్‌భవన్‌ సిబ్బంది కోసం గవర్నర్‌ ఏం చేశారో తెలుసా?

రాజ్​భవన్​ సిబ్బంది, వారి కుటుంబసభ్యుల కోసం గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్ రాజ్​భవన్​లోని సంక్షేమ భవన్​లో యోగా తరగతులను ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ యోగాను నిత్యకృత్యంగా మార్చుకోవాలని సూచించారు.

హైదరాబాద్ రాజ్‌భవన్​లోని సంక్షేమ భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యోగా తరగతులను ప్రారంభించారు. రాజ్‌భవన్ సిబ్బంది, వారి కుటుంబసభ్యుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తరగతుల్లో గవర్నర్ దంపతులు పాల్గొన్నారు.

ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు నిర్వహించిన ఆ యోగా తరగతుల్లో గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్, సలహాదారు ఏపీవీఎన్ శర్మతో పాటు సుమారు 200 మంది సిబ్బంది కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. ప్రతిరోజూ యోగా చేద్దాం: గవర్నర్ ప్రతి రోజు యోగా తరగతుల్లో పాల్గొనాలని గవర్నర్ కోరారు. ప్రధాని పిలుపుచ్చిన 'ఫిట్ ఇండియా' ఉద్యమానికి బలం చేకూరేలా ప్రతి రోజు అందరం యోగా చేద్దామన్నారు.

రాజభవన్‌ స్కూల్‌లో 6 నుంచి 10వ వరకు చదువుతున్న 450 మంది విద్యార్థులకు ప్రతి శనివారం ఈ అంశంపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తమిళిసై వివరించారు.