1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Drones prohibited around ISB Hyderabad for PM's visit

ఐఎస్‌బి గగనతలంపై డ్రోన్ల నిషేధం : సీవీ ఆనంద్ హెచ్చరిక

narendra modi
ఈ నెల 26వ తేదీ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ నగర పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి)‌ను సందర్శించనున్నారు. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని ఈ క్యాంపస్ గగనతలంపై రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్స్, పారా గ్లైడర్స్, రిమోట్ కంట్రోల్డ్ మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్స్‌లు ఎగురవేయడాన్ని నిషేధించారు. 
 
ఐఎస్‌బి క్యాంపస్ ఉండే ఐదు కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి డ్రోన్లు ఎగురవేయడానికి వీల్లేకుండా నిషేధం విధించారు. ఈ నిషేధాజ్ఞలు ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 26వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉండనుంది.
 
ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీచేశారు. ఈ అదేశాలు ఉల్లంఘించే వారిపై ఐపీసీ 188, సెక్షన్ 121, 121 (A), 287, 336, 338 సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
20 ఏళ్ల తర్వాత కేటీఆర్ భారత ప్రధాని కావొచ్చు.. ఆశా జడేజా