1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

ఈటల పాదయాత్ర : 23 రోజులు 270 కిలోమీటర్లు

ఇటీవల కాషాయం కండువా కప్పుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర చేపట్టనున్నారు. ఆయన సొంత నియోజక వర్గం హుజురాబాద్ లో జరగబోతున్న ఈ పాదయాత్ర  క‌మ‌లాపూర్ మండ‌లంలోని బ‌త్తినివానిప‌ల్లి నుంచి ప్రారంభిస్తున్నారు. 
 
బ‌త్తినివానిప‌ల్లిలోని ఆంజ‌నేయుని దేవ‌స్థానంలో సోమవారం ఉద‌యం 9:30 గంట‌ల‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన ఆయన శ‌నిగ‌రం, మాద‌న్న‌పేట‌, గునిప‌ర్తి, శ్రీరాముల‌పేట‌, అంబ‌ల గ్రామాల్లో పాద‌యాత్ర చేయ‌నున్నారు. రాత్రికి అంబ‌ల గ్రామంలో బ‌స చేయనున్నారు. మొత్తం 23 రోజుల పాటు 270 కిలోమీట‌ర్ల మేర ఈ పాద‌యాత్ర జరగనుంది.
 
కాగా, ఇటీవల తెరాసకు రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. దీంతో ఆయన ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన హుజురాబాద్ స్థానానికి జరిగే ఉపఎన్నికలను అటు తెరాస, ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా, ఈ ఉప ఎన్నిక ఈటల రాజేందర్‌కు జీవన్మరణ సమస్యగా మారింది.