1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Former MLA Kothakota Dayakar Reddy passes away

మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఇకలేరు...

kothakota dayakar reddy
తెలంగాణ రాష్ట్రం మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో  బాధపడుతూ వచ్చిన ఆయన హైదరాబాద్ నగరంలోని ఏజీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. దయాకర్ రెడ్డి మరణంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యంమత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర తెలంగాణ నేతలు, ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 
 
కాగా, దయాకర్ రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అమరచింత నియోజకవర్గానికి రెండుసార్లు, మక్తల్ స్థానం నుంచి ఒకసారి గెలుపొందారు. అలాగే, తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు. ఆయన స్వస్థలం పాలమూరు జిల్లాలోని పర్కపురం గ్రామం. అంత్యక్రియలు నేడు జరుగనున్నాయి. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
రాహుల్ గాంధీకి ఊరట.. ఎందుకో తెలుసా?