గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (14:21 IST)

మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ కన్నుమూత

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ కన్ను ముశారు. నల్గొండ జిల్లా చలకుర్తి నియోజకవర్గానికి 1994 నుంచి 1999 వరకు శాసనసభ్యునిగా సేవలు అందించారు.

నాగార్జున సాగర్ (చలకుర్తి) మాజీ ఎమ్మెల్యే, తెరాస నేత గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి మృతి చెందారు. 1994-99 మధ్య చలకుర్తి తెదేపా ఎమ్మెల్యేగా రామ్మూర్తి యాదవ్ పని చేశారు.

అంత్యక్రియలు త్రిపురారం మండలం పెద్ద దేవులపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జీవిత ప్రస్థానం 1947 అక్టోబర్ 26 న గుండెబోయిన మట్టయ్య, మహా లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. 1981లో పెద్ద దేవులపల్లి గ్రామ సర్పంచ్​గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.

ఎన్టీఆర్​కు అత్యంత సన్నిహితులు. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ఉద్యమ నాయకునిగా ఉన్న కేసీఆర్ సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా అందరికి అజాత శత్రువుగా పేరు సంపాందించారు. ఆయన మృతికి ప్రజాప్రతినిధులు, నేతలు నివాళులు అర్పించారు.