సంబంధిత వార్తలు
- కాజోల్-అజయ్ దేవగన్ ల మధ్య లడాయా? లవ్వాటా? నెటిజన్స్తో ఆడుకుంటున్నారు...
- నీ భార్య నాతో చాటింగ్ చేయపోతే నీ అంతు చూస్తా.. భర్తకు బెదిరింపులు
- మిలియనీర్ కావాలని నిండు గర్భణి గొంతుకోసిన భర్త...
- గొడవ పడుతున్న భార్యకు ముద్దిచ్చిన భర్త.. ఇదే అదునుగా నాలుక కొరికేసిన భార్య...
- ప్రణయ్కు విగ్రహమా? అలాచేస్తే కేసు వేస్తానంటున్న అమృత
రూ. 2 వేలు చెక్కును రూ. 12 వేలుగా మార్చిన మాజీ భార్య... ఆ తర్వాత...
మెహదీపట్నం పద్మనాభనగర్ కాలనీకి చెందిన గణపతి (46) శ్రీదేవి(38)లకు 1998లో వివాహం జరిగింది. కుటుంబ కలహాలు కారణంగా 2007లో విడాకులు తీసుకున్నారు. భార్యకు భరణంగా రూ. 4 వేలు ప్రతినెలా ఇవ్వాలని భర్తకు న్యాయస్థానం తీర్పునిచ్చింది. 2008లో గణపతి తండ్రి ఆస్పత్
మెహదీపట్నం పద్మనాభనగర్ కాలనీకి చెందిన గణపతి (46) శ్రీదేవి(38)లకు 1998లో వివాహం జరిగింది. కుటుంబ కలహాలు కారణంగా 2007లో విడాకులు తీసుకున్నారు. భార్యకు భరణంగా రూ. 4 వేలు ప్రతినెలా ఇవ్వాలని భర్తకు న్యాయస్థానం తీర్పునిచ్చింది. 2008లో గణపతి తండ్రి ఆస్పత్రిలో ఉండటంతో డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో రూ. 4 వేలకు బదులుగా రూ. 2 వేలు చెక్కు ఇచ్చారు గణపతి.
దాంతో ఆ 2 వేలు చెక్కుకు ముందు 1 పెట్టి రూ.12 వేలు డ్రా చేసింది శ్రీదేవి. బ్యాంకు స్టేట్మెంట్ చూసిన గణపతి 2008లో లంగర్ హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అప్పటి ఎస్.ఐ సంతోష్ కుమార్ ఆధారాలు సేకరించి కోర్టులో ఛార్జిషీలు దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ చేపట్టిన అనంతరం 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ హరీష్ మోసానికి పాల్పడిన భార్య శ్రేదేవికి మూడు సంవత్సరాల కారాగార శిక్ష. 35 వేలు జరిమానా విధించారు. ఈ కేసు విచారణకు పదేళ్లు పట్టింది.
తర్వాతి కథనం
