గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (09:18 IST)

మిలియనీర్ కావాలని నిండు గర్భణి గొంతుకోసిన భర్త...

మూఢనమ్మకం ఓ నిండు గర్భిణి ప్రాణాలు తీసింది. ఈ దారుణానికి పాల్పడింది కూడా కట్టుకున్న భర్తే. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఓ స్వామీజీ ఇచ్చిన సలహాతో భార్య గొంతుకోసి చంపేశాడు కట్టుకున్న భర్త.

మూఢనమ్మకం ఓ నిండు గర్భిణి ప్రాణాలు తీసింది. ఈ దారుణానికి పాల్పడింది కూడా కట్టుకున్న భర్తే. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఓ స్వామీజీ ఇచ్చిన సలహాతో భార్య గొంతుకోసి చంపేశాడు కట్టుకున్న భర్త. అంటే మూఢనమ్మకం పేరిట హత్యకు పాల్పడ్డాడు. ఈనెల 19వ తేదీన పుదుచ్చేరిలో జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
పుదుచ్చేరికి చెందిన ఓ వ్యక్తికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయనకు మూఢ నమ్మకాలు ఎక్కువ. అదేసమయంలో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో తన కష్టాలు పోగొట్టుకునేందుకు ఓ స్వామీజీని ఆశ్రయించాడు. మహిళను బలిస్తే ఆర్థిక కష్టాలు తీరిపోవడమేకాకుండా సంపద సమకూరుతుందని చెప్పాడు. ఆ స్వామీజీ మాటలు నమ్మిన ఆ వ్యక్తి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తన భార్యనే బలిగా ఇచ్చాడు. 
 
తన భార్య గొంతు కోసి పొదల్లో పడేసి.. ఏమీ ఎరగనట్టు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తొలుత నిందితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. బాధితురాలి జాడ కనుగొనడానికి ప్రయత్నించిన పోలీసులకు ఊరి శివార్లలో ఆమె దేహం కనిపించింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో మృతురాలి భర్తకు మూఢనమ్మకాలు ఎక్కువని తెలుసుకున్నారు. ఆ తర్వాత అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారణ జరపడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఓ స్వామిజీ ఇచ్చిన సలహా మేరకు తాను ఇంత దారుణానికి పాల్పడినట్లు తెలిపాడు. 
 
ఈ దారుణానికి పాల్పడిన ఘటనలో తాను మరో ఐదుగురు వ్యక్తుల సహాయం తీసుకున్నట్లు నిందితుడు తెలిపాడు. వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు. అలాగే గర్భిణీ స్త్రీని బలివ్వాలని సలహా ఇచ్చిన స్వామిజీ ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.