1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Gurukul Student Commits Suicide

గురుకుల పాఠశాలలో బాలిక ఆత్మహత్య

suicide
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఓ బాలిక ఆత్మహత్య కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... పదర మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఏడో తరగతి చదువుతోంది. 
 
సోమవారం సాయంత్రం తోటి విద్యార్థులు ఆటల కోసం మైదానంలోకి వెళ్లగా బాలిక కనిపించలేదు. దీంతో మరో బాలిక ఆ విద్యార్థిని కోసం తరగతి గదికి వెళ్లి చూడగా, చున్నీతో ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. 
 
విచారణలో చదువులో వెనకబడిందని ఉపాధ్యాయులు వేధించడంతోనే మనస్తాపంతో తమ కుమార్తె బలవన్మరణానికి పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తూ బంధువులతో కలిసి ఆందోళన చేపట్టారు.  
తర్వాతి కథనం
రెండు గుండెలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో వింత శిశువు