శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2020 (09:22 IST)

బత్తాయి జ్యూస్‌లో మత్తుమందు కలిపి రేప్ చేసిన వంట మనిషి!

హైదరాబాద్ నగరంలో ఓ వంటమనిషి పాడుపనికి పాల్పడ్డాడు. బత్తాయి జ్యూస్‌లో మత్తుమందు కలిపి 19 యేళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, లాలాపేటలో నివాసముంటున్న 19 యేళ్ళ యువతి.. బర్కత్‌పురలోని ఓ ఆస్పత్రిలో ఆయాగా పనిచేస్తుంది. అదే ఆస్పత్రిలో పీర్జాదిగూడకు చెందిన రవి (40) అనే వ్యక్తి వండ మనిషిగా పని చేస్తున్నాడు. 
 
అయితే, ఆ యువతిపై కన్నేసిన రవి.. ఆమెకు బత్తాయి జ్యూస్‌లో మత్తుమందు కలిపిన జ్యూస్ ఇచ్చాడు. అది సేవించిన ఆ యువతి అపస్మారకస్థితిలోకి జారుకోవడంతో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇలా పలుమార్లు చేశారు. ఈ క్రమంలో ఆ యువతి గర్భందాల్చడంతో శరీరంలో మార్పులు సంభవించాయి. 
 
దీంతో తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో బాధితురాలు జరిగిన విషయం చెప్పింది. గురువారం ఆ యువతి కాచిగూడ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. రవిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న రవి కోసం పోలీసులు గాలిస్తున్నారు.