మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఆగస్టు 2020 (12:04 IST)

మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడి.. బాలికతో మాత్రలు మింగించి..

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. మహిళలపై అకృత్యాలు ఏమాత్రం తగ్గట్లేదు. నేరాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వయోబేధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కామాంధులు. తాజాగా మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. హైదరాబాద్ పరిధి లోని కుల్సుంపురాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాదుకు చెందిన ఓ మైనర్ బాలికపై రోహన్ అనే యువకుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బోనాల ఉత్సవాల్లో మైనర్ బాలికతో రోహన్ పరిచయం పెంచుకున్నాడు. బాలికతో బలవంతంగా యువకుడు మాత్రలు మింగించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
విషయం బయటికి చెప్తే చంపేస్తానంటూ బాలికపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ యువకుడితో తమకు ప్రాణ హాని ఉందని కుల్సుంపూర పోలీస్ స్టేషన్‌లో బాలిక కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఈ నెల 12న కుల్సుంపూరాలో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రోహన్ పరారీలో ఉన్నాడు.