సంబంధిత వార్తలు
- హైదరాబాద్ మెట్రోపై కరోనా పంజా : భారీ నష్టాల్లో.. ఎల్ అండ్ టి ఆపన్నహస్తం
- హైదరాబాద్లో రాత్రి 9.45 గంటల వరకు మెట్రో సేవలు
- SSMBతో నివేదా థామస్.. త్రివిక్రమ్ ''పార్థు''లో అమ్మడు సెకండ్ హీరోయినా?
- ఇష్టమైన మహీంద్రా వాహనం ఇప్పటికిపుడే సొంతం చేసుకోవచ్చు.. ఎలా?
- పవన్ కళ్యాణ్కు బంపర్ ఆఫర్, బిజెపి వ్యూహమేంటి? (video)
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఎల్ అడ్ టి బంపర్ ఆఫర్
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఎల్ అండ్ టి బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని ఈ పండగ ఆఫర్లను ప్రకటించింది. మెట్రో సువర్ణ ఆఫర్ 2021 పేరుతో ఈ నెల 18 నుంచి జనవరి 15 మధ్య ట్రిప్ పాసుల్లో పలు రాయితీలు ప్రవేశపెట్టింది.
ఇందులోభాగంగా 20 ప్రయాణాలకు డబ్బులు చెల్లించి 30 సార్లు ప్రయాణించవచ్చు. అయితే, ఈ అవకాశాన్ని 45 రోజుల్లోపు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మెట్రో కార్డుపైనే ఈ ఆఫర్ను పొందొచ్చు.
అలాగే, జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గంలో ప్రస్తుతం 10 కిలోమీటర్ల దూరానికి రూ.35 వసూలు చేస్తుండగా, ఇకపై దీనిని రూ.15కి తగ్గించారు. అయితే, ఇది పూర్తిస్థాయి తగ్గింపు కాదు. పైన పేర్కొన్న రోజుల్లో మాత్రమే వర్తిస్తుంది.
నెలలో 20 సార్లు కంటే ఎక్కువ సార్లు ప్రయాణించే వారి కోసం ప్రతి నెలా లక్కీడ్రా తీసి ఐదుగురు విజేతలను ఎంపిక చేస్తారు. లక్కీ డ్రా కోసం వీరు తమ కార్డును టీ-సవారి, లేదంటే మెట్రో స్టేషన్లలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు.