1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (15:45 IST)

హైదరాబాదులో కొత్త జబ్బు.. నల్లిన పోలిన పురుగులతో?

హైదరాబాదును కొత్త వైరస్ పట్టిపీడిస్తోంది. ఒకవైపు కరోనా మరోవైపు ఒమిక్రాన్ ముప్పుతో జనం జడుసుకుంటున్న తరుణంలో  నగరంలో స్క్రబ్‌ టైఫస్‌ బాధితులు ఎక్కువయ్యారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఏకంగా 15 మంది ఈ స్క్రబ్‌ టైఫస్‌ చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ బాధితుల్లో పిల్లలే ఎక్కువమంది ఉన్నారట. ఈ నెలలో నలుగురు చిన్నారులు ఆసుపత్రిలో చేరారు. ఇప్పటికే ఇద్దరికి తగ్గిపోగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
 
ఈ స్క్రబ్ టైఫస్ పురుగులు కుట్టడం వల్ల సోకుతుంది. ఇవి ఇళ్లలో, మంచాలు, పెరటి మొక్కల్లో, తడిగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతుంటాయి. చూడటానికి ఆ పురుగులు చిన్న సైజులో నల్లిని పోలి ఉంటాయి. 
 
అంతేకాదు ఎక్కువగా రాత్రి సమయాల్లో కనిపిస్తాయి. ఈ పురుగు కుడితే తీవ్రమైన జ్వరం, ఒళ్లు, కండరాల నొప్పులు వస్తాయి. కొందరిలో ఒంటిపై దద్దుర్లు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.