1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2023 (13:12 IST)

కృష్ణా ఎక్స్‌ప్రెస్ రద్దు... రైల్వే అధికారుల వెల్లడి

train
సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఆదిలాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు చేశారు. ఈ విషయాన్ని విజయవాడ డివిజన్ అధికారులు వెల్లడించారు. గత రెండు వారాల్లో ఈ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అలాగే, మరో మూడు ప్యాసింజర్ రైళ్ళను కూడా ఈ నెల 15వ తేదీ వరకు రద్దు చేశారు. 
 
సికింద్రాబాద్ డివిజన్‌లో ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ నెల 10, 11 తేదీల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి నగదును తిరిగి చెల్లిస్తామని తెలిపారు. మరోవైపు, కాజీపేట - డోర్నకల్ మధ్య నడిచే డోర్నకల్ ప్యాసింజర్, సికింద్రాబాద్ - వరంగల్ మధ్య నడిచే పుష్‌పుల్, కాజీపేట - బల్లార్షా మధ్య నడిచే బల్లార్షా ఎక్స్‌ప్రెస్ రైళ్ళను కూడా ఈ నెల 15వ తేదీ వరకు రద్దు చేసినట్టు తెలిపారు.