1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Minister Harish Rao comments on YS Sharmila

ఎవరో వచ్చి.. తెలంగాణ రైతులకు అన్యాయం జరిగిందని అరుస్తున్నారు.. మంత్రి హరీష్

Minister Harish Rao
తెలంగాణా రాష్ట్రంలో కొత్త పార్టీని పెట్టనున్న మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్. షర్మిలపై తెలంగాణ మంత్రి హరీష్ రావు పేరు ప్రస్తావించకుండానే సుతిమెత్తగా విమర్శలు గుప్పించారు. 

సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో బుధవారం రైతు వేదికను ప్రారంభించిన హరీష్ రావు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై ఆయన కామెంట్స్ చేశారు. 

'ఎవరో వచ్చి తెలంగాణలో రైతులకు ఏం న్యాయం జరిగింది అని మాట్లాడుతున్నారు. ఇక్కడికొచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారు' అంటూ పరోక్షంగా షర్మిలకు హరీష్ రావు చురకలంటించారు. అసలు వాళ్లకు తెలంగాణపై కనీస పరిజ్ఞానం ఉందా? అని ప్రశ్నించారు. 

ఏపీలో రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి ఎంత భూమి ఉన్నా రూ.12.500 మాత్రమే ఇస్తున్నారని, అదే ఇక్కడ ఎకరానికి పదివేల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా రైతుబంధు ఇస్తున్నామని హరీష్ గుర్తు చేశారు.

కాగా, తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని వైఎస్ షర్మిల మంగళవారం హైదరాబాద్ లోటస్ పాండ్‌లో తన మద్దతుదారులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ప్రకటించిన విషయం తెల్సిందే. పైగా, తనకు, అన్న జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని కూడా ప్రకటించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
భారత్ ఆదేశాలు చట్ట విరుద్ధం : ట్విట్టర్ సంచలన కామెంట్స్