తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణాలో ఏర్పడబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. ఆయన ఆదివారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తూ, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు....