ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 18 అక్టోబరు 2021 (09:12 IST)

అబద్ధం తప్ప నిజం చెప్పనని ఒట్టు పెట్టుకున్న కేసీఆర్: రాములమ్మ

కేసీఆర్ అబద్ధం తప్ప నిజం చెప్పనని ఒట్టు పెట్టుకున్న మనిషని రాములమ్మ ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లబోవడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి సెటైర్ వేశారు.

సందర్భం లేకుండా ముందస్తు ఎన్నికలు లేవని కేసీఆర్ చెప్పారంటే పక్కా ముందస్తు ప్రణాళిక ఉన్నట్లేనన్నారు. ఎన్నికలకు ప్రతిపక్షాలు సిద్ధమవడం మంచిదని విజయశాంతి సూచించారు.

దీనికి సంబంధించి రాములమ్మ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అంతకుముందు టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని, చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని తెలిపారు. ఇంకా రెండేళ్లు ఉందని, మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా పనిచేయాలని టీఆర్ఎస్ నేతలకు సూచించారు.