శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 13 నవంబరు 2022 (10:19 IST)

సూర్యపేటలో రోడ్డు ప్రమాదం : ఐదుగురి దుర్మరణం

road accident
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపటలో ఘోరం జరిగింది. అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మునగాల పెట్రోల్ బంకు వద్ద అర్థరాత్రి 12 గంటల సమయంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
సాగర్ ఎడమకాల్వ గట్టుపై ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో గత రాత్రి మహాపడి పూజ కార్యక్రమాన్ని కొందరు అయ్యప్ప భక్తులు నిర్వహించారు. ఈ పూజను విజయవంతంగా పూర్తి చేశారు. 
 
పూజ ముగించుకుని ట్రాక్టర్ ట్రాలీలో 38 మంది తిరిగి మునగాలకు బయకు బయలుదేరారు. వీరి ట్రాక్టర్ విజయవాడ - హైదరాబాదా జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో వెళుతుండగా, మునగాల శివారు ప్రాంతంలోని పెట్రోల్ పంపు వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న ఓ లారీ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది వరకు గాయపడ్డారు. వీరిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.