సంబంధిత వార్తలు
- నాగోలు వంతెనపైకి రాగానే ట్యాంకర్ లారీకి బ్రేకులు ఫెయిల్.. తర్వాత ఏమైంది?
- రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రికి తరలించిన మంత్రి కేటీఆర్
- ఆదిలాబాద్లో ఘోరం - కంటైనర్ను ఢీకొన్న కారు - నలుగురి మృతి
- అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం- ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి
- బ్రిటన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం
సూర్యపేటలో రోడ్డు ప్రమాదం : ఐదుగురి దుర్మరణం
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపటలో ఘోరం జరిగింది. అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మునగాల పెట్రోల్ బంకు వద్ద అర్థరాత్రి 12 గంటల సమయంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
సాగర్ ఎడమకాల్వ గట్టుపై ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో గత రాత్రి మహాపడి పూజ కార్యక్రమాన్ని కొందరు అయ్యప్ప భక్తులు నిర్వహించారు. ఈ పూజను విజయవంతంగా పూర్తి చేశారు.
పూజ ముగించుకుని ట్రాక్టర్ ట్రాలీలో 38 మంది తిరిగి మునగాలకు బయకు బయలుదేరారు. వీరి ట్రాక్టర్ విజయవాడ - హైదరాబాదా జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వెళుతుండగా, మునగాల శివారు ప్రాంతంలోని పెట్రోల్ పంపు వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న ఓ లారీ ట్రాక్టర్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది వరకు గాయపడ్డారు. వీరిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
తర్వాతి కథనం