1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Senior Congress leader Jaipal Reddy cremated with state honors

జైపాల్ రెడ్డి పాడె మోసిన కర్నాటక మాజీ స్పీకర్ రమేశ్ కుమార్..

Congress leader
హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో పీవీ ఘాట్‌ సమీపంలో నిర్వహించిన జైపాల్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నకర్నాటక మాజీ స్పీకర్ రమేష్, జైపాల్‌ పాడెను భుజానకెత్తుకుని మోశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రమేశ్, జైపాల్ మరణంతో ఇంట్లో పెద్ద దిక్కు పోయినట్టనిపిస్తోందన్నారు. 
 
జైపాల్‌తో తనది 35 ఏళ్లకు పైబడిన అన్నదమ్ముల బంధమన్నారు. కర్ణాటక అసెంబ్లీలో తాను వ్యవహరించిన తీరుపై జైపాల్‌ రెడ్డికి వివరించాలని ఇక్కడికి వద్దామనుకున్నానన్నారు. కానీ భగవంతుడు తనకు ఆ ఛాన్స్‌ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 
 
కష్టకాలంలో సైతం తప్పులు చేయకూడదని.. సైద్ధాంతిక నిబద్ధతతో ఉండాలని చెప్పిన మహానుభావుడన్నారు. తాను తప్పు చేస్తే జైపాల్ రెడ్డి మందలించేవారని, నాకు ఎన్నో సలహాలు సూచనలు అందించేవారని గుర్తుచేసుకున్నారు రమేశ్.
About Writer
శ్రీ
తర్వాతి కథనం
కార్గిల్ యుద్ధానికి 20 ఏళ్ళు... కానీ, ఏం ఒరిగింది?' - తండ్రిని కోల్పోయిన గుర్‌మెహర్ కౌర్