శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By

సిద్ధాంతపరంగా ముక్కుసూటి మనిషి జైపాల్ రెడ్డి

సిద్ధాంతపరంగా ముక్కుసూటి మనిషి ఎస్.జైపాల్ రెడ్డి. కానీ, కుటుంబ వ్యవహారాల్లో మాత్రం చాలా దూరంగా ఉండేవారు. ఈ విషయాన్ని ఆయన చిన్న సోదరుడు ఎస్.మనోహర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆయన మరణం ఇంకా జీర్ణించుకోలేక పోతున్నామన్నారు. 
 
కుటుంబ సభ్యులతో చాలా ప్రేమగా ఉండేవారని.. మా చిన్నాయన పెదనాయన పిల్లలతో సహా అందరితో చాలా ప్రేమగా సన్నిహితంగా ఉండేవారని తెలిపారు. సమాజంలో నీతి నిజాయితీగా ఎలా ఉండాలనేది ఆయన నుంచే నేర్చుకున్నామన్నారు. 
 
తన నియోజక వర్గం కల్వకుర్తిలో ప్రజలకు ఎంతో సేవ చేశారనీ, అంతేకాకుండా, రాష్ట్రంలోనూ సహాయం ఆర్ధించి వచ్చిన చాలా మందికి ఆయన సహయం అందించారని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. 
 
కాగా, కొన్ని రోజులుగా న్యుమోనియాతో బాధపడుతూ వచ్చిన జైపాల్ రెడ్డి గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం జులై 28వ తేదీ అర్థరాత్రి కన్నుమూశారు. ఆస్పత్రి నుంచి జైపాల్‌రెడ్డి పార్థివ దేహాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి తరలించారు. ఈయన అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి.