సంబంధిత వార్తలు
- ఆడరౌడీ ఎమ్మెల్యేలు, బూతుల మంత్రులు.. హమ్మ, దివ్యవాణి ఎంతమాటన్నారు?
- రాజన్న రాజ్యం అంటూ పిల్లచేష్టలు, ఆ ఇద్దరికీ వేలకోట్లు: చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు
- జగనన్న బాణం వస్తోంది, కేసీఆర్ని కాపాడుకోవాలి: మంత్రి గంగుల
- నిమ్మగడ్డలో "చంద్ర"ముఖి, అందుకే ప్రతిసారీ లకలకలక: విజయసాయి రజినీ డైలాగ్
- తాడేపల్లి ప్యాలెస్ విసిరే బిస్కట్లకు ఆశపడిన కొందరు ఉద్యోగ సంఘాల ‘బాడుగ నేతలు’ అయ్యారు: పట్టాభిరామ్
నోరు జారిన తెరాస ఎమ్మెల్యే టి.రాజయ్య
తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.రాజయ్య నోరుజారారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న ఈయన... తెరాస సభ్యత్వం ఉంటేనే ఇకపై ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కూడా ఇదే వర్తిస్తుందని, పార్టీని రక్షించుకోవడానికి ఇదే మంచి మార్గం అని ఆయన వ్యాఖ్యానించారు.
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రాజయ్య స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గంలోని గ్రామాల్లో పర్యటించారు. సభ్యత్వ నమోదు పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. రాజయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
రాజయ్య చేసిన ఈ వ్యాఖ్యలపై టిఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. అవకాశం కోసం చూస్తున్న ప్రతిపక్షాలు రాజయ్య వ్యాఖ్యలపై ఎంత ఘాటుగా స్పందిస్తాయో చూడాలి. కాగా, గతంలో కూడా టి.రాజయ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా మంత్రిపదవిని కోల్పోయిన విషయం తెల్సిందే.
తర్వాతి కథనం