సంబంధిత వార్తలు
- హోం వర్క్ చేయలేదనీ.. కంటిలో పెన్నుతో గుచ్చిన టీచర్.. ఎక్కడ?
- కులపిచ్చి ప్రొఫెసర్ల వేధింపుల వల్లే డాక్టర్ శిల్ప సూసైడ్ : ఎమ్మెల్యే రోజా
- డాక్టర్ శిల్ప సూసైడ్ కేసు : ప్రొఫెసర్ల మాటలే ఈటెల్లా గుచ్చుకున్నాయ్...
- ఒక్క రాత్రి సహకరిస్తే జీవితం మారిపోతుంది... వైద్య విద్యార్థినితో...
- నాలుగో తరగతి విద్యార్థినిపై సీనియర్ల వేధింపులు.. నువ్వు క్యూట్గా వున్నావంటూ?
సెల్ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
సెల్ఫోన్ కొనివ్వలేదనే కారణంతో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం నాడు తెలంగాణలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో చోటుచేసుకుంది. శ్రీరాములపల్లికి చెందిన వివేకానందరెడ్డి (16) గొల్లపల్లి ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదువుతున
సెల్ఫోన్ కొనివ్వలేదనే కారణంతో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం నాడు తెలంగాణలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో చోటుచేసుకుంది. శ్రీరాములపల్లికి చెందిన వివేకానందరెడ్డి (16) గొల్లపల్లి ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గతంతో వివేక్ తండ్రి ఏలేటి తిరుపతిరెడ్డి అతనికి సెల్ఫోన్ కొనిచ్చాడు.
ఇటీవల తిరుపతి వెళ్లినప్పుడు వివేక్ సెల్ ఫోన్ పోయింది. దీంతో మళ్లీ కొత్త ఫోన్ కొనివ్వాలని మారాం చేస్తూ వచ్చాడు. అయితే ఇటీవలే ఇంటి నిర్మాణం, ద్విచక్రవాహనం కొనుగోలు చేయడం వల్ల ఖర్చులు పెరిగాయని, అందువల్ల తర్వాత కొనిస్తానని తండ్రి నచ్చజెప్పినప్పటికీ మనస్తాపం చెందిన వివేక్ మంగళవారం రాత్రి ఇంటిలో వారందరూ నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తర్వాతి కథనం