శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (09:39 IST)

ఉత్తమ ఐపీఎస్‌ల జాబితాలో తెలంగాణ డీజీపీ

తెలంగాణ డీజీపీకి అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని అత్యుత్తమ ఐపీఎస్‌ అధికారుల జాబితాలో డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డికి చోటు లభించింది.

4 వేల మందిలో చివరికి ఎంపిక చేసిన 25 మందిలో డీజీపీ స్థానం పొందారు. ఫేమ్‌ ఇండియా, ఏసియా పోస్ట్‌, పీఎస్‌యూ వాచ్‌ సంస్థలు నిర్వహించిన సర్వేలో భాగంగా తొలుత దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 4వేల మంది ఐపీఎస్‌లను గుర్తించారు. వారిలో ఉత్తమ పనితీరును కనబర్చిన 200 మందిని వడబోసి చివరగా 25 మందిని ఎంపిక చేశారు.

నక్సలిజం, ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల్ని సమర్థంగా అణిచివేయడం అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నారు. నేరాల్ని నియంత్రించడంలో సామర్థ్యం, శాంతిభద్రతల్ని కాపాడటంలో పనితీరు, ప్రజామిత్ర పోలీసింగ్‌, సత్వర నిర్ణయాలు తీసుకోవడంలో నేర్పు లాంటి అంశాలకు పెద్దపీట వేసినట్లు పీఎస్‌యూ వాచ్‌ సంస్థ సంచాలకుడు వివేక్‌శుక్లా తెలిపారు.