సంబంధిత వార్తలు
- రూ.2.50 కోట్ల భూమి రూ.25 లక్షలకే ఎలా ఇచ్చారు? తెలంగాణ హైకోర్టు
- తెలంగాణలో భారీ వర్షాలు, పిడుగులకు అవకాశం, వాతావరణ శాఖ హెచ్చరిక
- పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలతో వ్యభిచారం.. అద్దెకు ఇల్లు తీసుకుని?
- ముస్లిం అమ్మాయి.. క్రిస్టియన్ కుర్రోడు... హిందూ సంప్రదాయంలో పెళ్ళి.. ఎక్కడ?
- తెలంగాణలో పెచ్చరిల్లిపోతున్న కరోనా కేసులు
తెలంగాణాలో కరోనా సోకి డీఎస్పీ కన్నుమూత
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 80 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 637 మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కరోనాను కట్టడిచేసే యత్నంలో భాగంగా ప్రాణాలను పణంగా పెట్టిన పలువురు వైద్య, పోలీసు సిబ్బంది కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు.
తాజాగా డీఎస్పీ శశిధర్ కరోనాతో ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈయన మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ డీఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయనకు ఇదివరకే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్టు సమాచారం. శశిధర్ మృతిపై జిల్లా పోలీసు అధికారులు సంతాపం ప్రకటించారు.
మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 80 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 637 మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కరోనాను కట్టడి చేసే యత్నంలో భాగంగా ప్రాణాలను ఫణంగా పెట్టిన పలువురు వైద్య, పోలీసు సిబ్బంది కూడా ఈ మహమ్మారి బారినపడుతున్నారు. అలా డీఎస్పీ శశిధర్ కరోనాతో ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.