సంబంధిత వార్తలు
- మీటర్ లో చమక్ చమక్ పోరి.. మాస్ సాంగ్ తో కిరణ్ అబ్బవరం
- ప్రతి భారతీయుడు గర్వించదగిన తరుణం : "నాటు నాటు"కు ఆస్కార్పై చిరు స్పందన
- భాగ్యనగరిలో వీధి కుక్కల స్వైర విహారం - 16 మందిపై దాడి
- అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట - అరెస్టుకు బ్రేక్
- ప్లీజ్... సీబీఐ తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వండి... కోర్టుకు అవినాశ్ రెడ్డి
చిరంజీవికి షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఎందుకో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో జూబ్లీహిల్స్ సొసైటీ నుంచి 595 చదరపు గజాల స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. ఇక్కడ నిర్మాణాలు చేసేందుకు ఆయన భూమి పూజా కూడా చేశారు. అయితే, ఆ భూమిని ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించిందనీ, అందువల్ల అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కొందరు కోర్టును ఆశ్రయించారు. వీటిని విచారణకు స్వీకరించిన కోర్టు ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
ప్రజా ఉపయోగం కోసం ఉద్దేశించిన 595 చదరపు గజాల స్థలాన్ని జూబ్లీహిల్స్ సొసైటీ చిరంజీవికి విక్రయించిందంటూ జె.శ్రీకాంత్ బాబు, మరికొందరు కలిసి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ భూమిపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి నియంత్రణ లేకపోవడంతో నిబంధనలు ఉల్లంఘించి సొసైటీ దానిని చిరంజీవికి విక్రయించిందని పిటిషనర్లు ఆరోపించారు.
కొనుగోలు చేసిన భూమిలో ఎలాంటి నిర్మాణాలు కూడా చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలు ఆలకించిన ధర్మాసనం కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ), జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 25వ తేదీకి వాయిదా వేసింది.