సంబంధిత వార్తలు
- షెడ్యూల్ ప్రకారమే జేఈఈ, నీట్ పరీక్షలు.. తేల్చేసిన సుప్రీం కోర్టు
- ఇతర రాష్ట్రాలలో జెఈఈ, నీట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఓయో ప్రత్యేక రాయితీలు
- నీట్, జేఈఈ పరీక్షలు.. ఆందోళనకు దిగిన విపక్షాలు.. సోనూ సపోర్ట్
- నీట్ పరీక్షల్ని వాయిదా వేసేది లేదు.. అడ్మిట్ కార్డుల విడుదల
- ఎపిలో ఇళ్ళపట్టాల పంపిణీ వాయిదా, మళ్ళీ ఎప్పుడంటే?
తెలంగాణాలో భారీ వర్షాలు, పరీక్షలు వాయిదా
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవలే కురిసిన భారీ వర్షాలు నుంచి రాష్ట్రం ఇంకా తేరుకోలేదు. ఈలోగా వాతావరణశాఖ మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కరోనా కారణంగా వాయిదా పడిన పరీక్షలను యూనివర్శిటీలు తిరిగి నిర్వహిస్తున్నాయి.
అయితే, ప్రస్తుతం వాతావరణం అనుకూలించకపోవడంతో పరీక్షలను వాయిదా వేస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. అలానే జెఎన్టియు, కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించాల్సిన ఎంబీఏ, డిగ్రీ సెమిస్టర్, బిఈడి పరీక్షలను కూడా వాయిదా వేశారు.
అక్టోబర్ 19, 20 వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా వేయగా, వాయిదా పడిన పరీక్షలను ఈ నెల 21 నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన షెడ్యూళ్లను యూనివర్శిటీ వెబ్ సైట్లో ఉంచినట్టు యూనివర్శిటీలు ప్రకటించాయి.