1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2023 (12:57 IST)

సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్న జవాన్ - ఐజీ చీఫ్ ఇంట్లో ఘటన

suicide
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఒక జవాను సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. సీఆర్పీఎఫ్ ఐజీ మహేష్ చంద్ర లడ్డా నివాసంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని దేవేందర్‌గా గుర్తించారు. ప్రేమ వ్యవహారం కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
 
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన దేవేందర్ కుమార్ గత 2021లో సీఆర్పీఎఫ్‌ జవానుగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని సీఆర్పీఎఫ్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్డా ఇంట్లో భద్రతా అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున చికోటి గార్డెన్ సమీపంలో దేవందర్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన సర్వీస్ రివాల్వ్‌తోనే కాల్చుకుని బలవన్మరానికి పాల్పడ్డాడు. 
 
అయితే, దేవేందర్ కుమార్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని బేగంపేట పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. జవాన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తుచేస్తున్నారు.