సంబంధిత వార్తలు
- మహిళపై గ్యాంగ్ రేప్ చేసి తప్పించుకోబోయి చచ్చాడు.. మరొకడు చావుబతుల మధ్య...
- ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి లాడ్జిలో కోరిక తీర్చుకుని ఆ తరువాత..?
- విమానం చక్రాల వెనుక దాక్కుని ప్రయాణం.. పదేళ్ల బాలుడి మృతి
- ఆస్ట్రేలియాలో భారత దంపతుల దుర్మరణం
- అచ్చెన్నాయుడు జస్ట్ ఎస్కేప్.... ఊపిరి పీల్చుకున్న టీడీపీ శ్రేణులు
వరంగల్ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు యువకులు మృతి
వరంగల్ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన పలువురిని కలిచివేసింది. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి సమీపంలో గురువారం రాత్రి ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ముగ్గురు మృతి చెందిన ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగదేవిపల్లి గ్రామానికి చెందిన ఇట్ల జగదీశ్(19), న్యాల నవీన్(20), జనగామ జిల్లా నర్మెట్ట మండలం మాన్సింగ్ తండాకు చెందిన లకావత్ గణేష్(21) ముగ్గురు ద్విచక్ర వాహనంపై వరంగల్ నుంచి గంగదేవిపల్లికి వెళుతున్నారు.
ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం గంగదేవిపల్లి సమీపంలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు వారి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనంపై ఉన్న ముగ్గురు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
తర్వాతి కథనం