శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 9 సెప్టెంబరు 2019 (17:44 IST)

బడ్జెట్ బండారాన్ని బయటపెట్టిన... పొన్నాల లక్ష్మయ్య

తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను సోమవారం ప్రవేశపెట్టారు. దీనిపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. ఆయన స్పందన ఆయన మాటల్లోనే... 
 
* ఈసారి వాస్తవిక బడ్జెట్ ఉంటుందని ప్రచారం చేసి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
* మరి గత అయిదు సంవత్సరాల నుండి ప్రవేశపెట్టిన బడ్జెట్ అవాస్తవమైనదా?
* ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి, కష్టాలలో ఉన్నామని చెప్పి మళ్లీ అవాస్తవమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు.
* పద్దెనిమిది నెలలుగా ఆర్థికమాంద్యమని అసెంబ్లీ సాక్షిగా చెబుతూ... అయిదు మాసాలకింద ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టారు.
* దేశంలో తగ్గుతున్న ఆర్థిక వృధ్ధిరేటు గురించి ఆర్థికమాంద్యం గురించి బలహీన పడుతున్న పారిశ్రామికరంగం గురించి తెలిసి 1,82,000 కోట్ల బడ్జెట్ ఎలా ప్రవేశపెట్టారు?
 అయిదు నెలల్లోనే కుదించి 36,000 కోట్లు తగ్గించి 1,46,000కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
* ఈనాటి బడ్జెట్ ఒక 'అంకెల గారడి'..
* అయిదేళ్లలో అద్భుతమైన ప్రగతి సాదించమంటున్నారు. కానీ ఆన్ గోయింగ్ ప్రాజెక్టులన్ని ఎక్కడివక్కడనే ఉన్నాయి. 8,500 కోట్లు ఖర్చుపెడితే 32 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితిని పక్కనపెట్టి కొత్త వాటిని మొదలుపెట్టారు.
 
* వాస్తవమని చెప్పి 1,82,000 కోట్లను 1,46,000 కోట్లకు తగ్గించిన తర్వాత కూడా లోటు 24,000 కోట్లు అంటున్నారు. అంటే ఖర్చు పెట్టేది 1,22,000 కోట్లు ఇందులో నుండి పాతబకాయిలు 31,000 కోట్లు తీసేస్తే 91,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టే అవకాశముంది.
* రాష్ట్ర రెవెన్యూ ఖర్చు 1,11,000 కోట్లలో అత్యవసర చెల్లింపులు, జీతాలు, పెన్షన్లకే సరిపోదు కదా! ఇలా ప్రజలను ఎంత కాలం మోసం చేస్తారు?
* మీరు చాలా వాగ్ధానాలు చేసారు కదా!  పేరుకుపోయిన బకాయిలు చెల్లిస్తామన్నారు. 
* నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావించలేదు, ఋణమాఫీ గురించి ఏమి మాట్లాడలేదు
, వడ్డీ విషయం ప్రస్తావించ లేదు, గత నాలుగున్నరేళ్లలో ఏనాడు కూడా రైతులకు వడగండ్లు, కరువు, మిగతా వైపరీత్యాలకు పంటనష్ట పరిహారం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రైతులకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వంకేసీఆర్ ప్రభుత్వం... నేటి మీ పాలనలో
* అంగన్వాడీ పాలుదొరకని పరిస్థితి. 
* ఆరోగ్యశ్రీ బకాయిలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వేల కోట్లకు చేరాయి. ముఖ్యమంత్రి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. చెరువుల వల్ల వ్యవసాయ వృద్ధిరేటు పెరిగిందంటున్నారు. ఏ ఊరికైనా పోదాం మీ మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగుచేసుంటే నీటి నిలువలు ఏ మేరకు ఉన్నాయో చూద్దాం.

ఇరవైనాలుగు గంటలు కరెంటు ఇచ్చి, చెరువులు బాగుచేసి నీటి నిలువ చేసి, రైతులను ఆదుకుంటే నేను అడుగుతున్నా, 2013-14లో కాంగ్రెస్ ప్రభుత్వం 7 గంటల కరెంట్ ఇస్తే 107 లక్షల టన్నుల ఆహారధాన్యాలు దిగుబడి వచ్చింది. మరి మీ మిషన్ కాకతీయ ద్వారా ఎంత వచ్చిందో చర్చిద్దాం. 

దమ్ముధైర్యముంటే ప్రజల ముందుకు వచ్చి మాట్లాడండి. మీ నమ్మబలికే పద్దతిని ప్రజలు త్వరలో గ్రహిస్తారు. మీరు శాశ్వతం కాదు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన మీ జిత్తులమారి నాటకాలు, వినయాలను తెలంగాణ సోదరసోదరీమణులు అర్థం చేసుకొని ఆలోచించాలని కోరుకుంటున్నాను.