1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (13:12 IST)

ఢిల్లీకి వరిధాన్యం కొనుగోలు పంచాయతీ

వరిధాన్యం కొనుగోలు పంచాయతీ మరోసారి ఢిల్లీకి చేరింది. ఈ విషయంపై కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు హస్తినకు వెళ్లనున్నారు తెలంగాణ మంత్రులు. ప్రధానితో సహా పలువురు కేంద్రమంత్రుల అప్పాయింట్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. 
 
ఇప్పటికే సగం కేబినెట్‌, ఢిల్లీకి చేరుకోగా.. మరికొందరు మంత్రులు కూడా అక్కడికి వెళ్లనున్నారు. దేశ రాజధానిలో మకాం వేసిన తెలంగాణ కేబినెట్ వరిధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి స్పష్టత కోరుతోంది.  
 
ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కలవనున్నారు తెలంగాణ మంత్రులు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన హామీకి ఇవ్వాలని కోరనున్నారు.
 
తెలంగాణ రాష్ట్ర సర్కార్ కేంద్రంపైఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు తమ నిరసన తెలుపగా.. సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా నిరసనలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. 
 
ఈ మేరకు నేడు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తెరాస నిరసనలు చేయనుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని కేసీఆర్ సూచించారు.ో