సంబంధిత వార్తలు
- కొడుకు కంట్లో కారం కొట్టిన తల్లి.. చెట్టుకు కట్టేసి..?
- ఐపీఎల్ శాలరీతో అమ్మ కోసం ఇల్లు కొంటా: ఈ వైభవ్ అరోరా ఎవరు?
- స్కాట్లాండ్లో పెళ్లిలో హింస.. తల్లిపైనే వధువు దాడి.. జైలులోనే ఫస్ట్నైట్
- బాయ్ఫ్రెండ్ కోసం కన్నబిడ్డను చంపేసింది.. మద్యం తాగించి..?
- స్మార్ట్ ఫోన్ కొనివ్వకపోవడంతో తల్లినే చంపేశాడు.. ఎక్కడ?
తెలంగాణ ప్రభుత్వ సీఎస్ సోమేష్ కుమార్కు మాతృవియోగం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి మీనాక్షి సింగ్ (85) సోమవారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ గత మూడు వారాలుగా హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆమె ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు.
కాగా, ఆమె పార్థివదేహానికి బీహార్ రాష్ట్రంలోని సొంత గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, మీనాక్షి సింగ్ మృతిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఇతర రాజకీయ పార్టీల నేతలు తమ ప్రగాఢ సంతాన్ని, సానుభూతిని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలోని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.