శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : ఆదివారం, 11 ఆగస్టు 2019 (15:29 IST)

వాళ్లిద్దరూ కృష్ణార్జునులు వంటివారు.. రజనీకాంత్ కితాబు

ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ భారతీయ జనతా పార్టీపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ద్వయాన్ని కొనియాడారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై రూపొందించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం చెన్నైలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడుతో పాటు హోంమంత్రి అమిత్‌షా, రజినీకాంత్ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా సూపర్ స్టార్ మాట్లాడుతూ.. కాశ్మీర్ సమస్య పరిష్కారంలో బీజేపీ విజయవంతమైందన్నారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లు విషయంలో చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. ఈ బిల్లుపై పార్లమెంట్‌లో హోం మంత్రి అమిత్‌షా ప్రసంగం చాలా అద్భుతంగా ఉందని అభినందించారు. అంతేకాదు మోదీ, షాలు కృష్ణార్జునులవంటివారని రజినీకాంత్ అభివర్ణించారు.
 
కాశ్మీర్ అంశంపై వారిద్దరి వైఖరి, ఆర్టికల్ 370లను ప్రస్తావించిన రజనీకాంత్, ఈ విషయంలో తనకు చాలా సంతోషం కలిగిందని, వారిద్దరూ కలిసి కాశ్మీర్‌ను భారత్‌లో పూర్తిగా విలీనం చేయడంలో విజయవంతం అయ్యారని కొనియాడారు.