సంబంధిత వార్తలు
- అలిపిరి ఘటన: బాబు క్షమాపణ చెప్పాలట.. అది నిరసన మాత్రమే దాడిలా చూడటం?
- అమిత్ షా కాన్వాయ్పై రాళ్లదాడి.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. క్రమశిక్షణగా?
- స్వామి నువ్వు గెలిపిస్తావు.. నాకు తెలుసు: శ్రీవారిని ప్రార్థించిన అమిత్ షా
- మంత్రులు అందుకు రెడీ.. కానీ మోదీ, అమిత్ షా అడ్డుపడుతున్నారు..?
- కేసీఆర్ మా స్నేహితుడే.... ఆయన ప్రయత్నం స్వాగతిస్తున్నా : అమిత్ షా
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కన్నా నియామకం.. (వీడియో)
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా శ్రమించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఎన్నికల కమిటీ కన్
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా శ్రమించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఎన్నికల కమిటీ కన్వీనర్గా ఎంపిక చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ ఆదివారం దీనిపై అధికారికంగా ప్రకటన జారీచేశారు. వెరసి... దాదాపు నెల రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరదించారు.
పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న వైజాగ్ ఎంపీ కంభంపాటి హరిబాబు రాజీనామా తర్వాత... అధ్యక్ష పదవి కోసం అనేక పేర్లు పరిశీలనకు వచ్చాయి. బలమైన నాయకుడి కోసం జల్లెడ పట్టగా... కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు, దగ్గుబాటి పురంధేశ్వరి, పైడికొండల మాణిక్యాలరావు ముందు వరుసలో నిలిచారు.
ఒక్కొక్కొరితో పార్టీకి కలిగే ప్రయోజనాలను బేరీజు వేసుకోవడంతోపాటు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని... సోము వీర్రాజు, కన్నా పేర్లు తుది జాబితాలో నిలిచాయి. చివరికి... అధ్యక్ష పదవి కన్నా లక్ష్మీనారాయణను వరించింది. రాష్ట్రంలో తొలిసారిగా ఎన్నికల కమిటీ కన్వీనర్ పదవిని ఏర్పాటు చేసి... దానిని సోము వీర్రాజుకు అప్పగించారు.
