శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 2 జులై 2019 (16:40 IST)

లక్ష్మీ పార్వతిపై ఆ ఆరోపణలు చేసిన యువకుడికి భాజపా తీర్థం... పూనమ్ ఏమంటుందో?

ఆమధ్య తనను వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి లైంగికంగా వేధిస్తోందంటూ సోషల్ మీడియాలో కలకలం సృష్టించిన కోటి అనే యువకుడు వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఐతే ఆ యువకుడు హఠాత్తుగా ఇప్పుడు ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకున్నాడు. 
 
కొన్ని రోజుల క్రితం తనను వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి లైంగికంగా వేధిస్తోందంటూ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసి వార్తల్లోకి ఎక్కాడు. కాగా అతడు తనపై దుష్ర్పచారం చేసి తన పరువుకి భంగం కలిగించాడంటూ లక్ష్మీపార్వతి తెలంగాణ డిజీపి ఫిర్యాదు చేశారు.

ఇతడిపై నటి పూనమ్ కౌర్ కూడా సైబర్ క్రైమ్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడం గమనార్హం. వీరిరువురూ తమను కోటీ అనే వ్యక్తి వాట్సప్ మెసేజిలతో వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేశారు. ఐతే.. అతడు ఇప్పుడు భాజపాలో చేరడం చర్చనీయాంశంగా మారింది.