సంబంధిత వార్తలు
- తమన్నా పాటకు డ్యాన్స్ ఇరగదీసిన వైసీపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
- దిశ దోషులను శిక్షిస్తే అసెంబ్లీలో మాట్లాడారు, సుగాలి ప్రీతి గురించి మాట్లాడరేం? పవన్ ప్రశ్న
- #DelhiResults : ఢిల్లీ ఓట్ల లెక్కింపు : ఆప్ గెలుపు 21 (లీడ్ 38) - బీజేపీ గెలుపు 2 (లీడ్ 9) కాంగ్రెస్-0...
- ఓట్ల లెక్కింపునకు ముందు అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశారో తెలుసా?
- ఆప్ కీ సర్కార్.. మోడీ కుంభస్తలాన్ని కొట్టి కేజ్రీవాల్
పొత్తు పెట్టుకుంటే నాకు ఫోన్ చేసి చెప్పేవారు, ఇదంతా గేమ్: పవన్ కళ్యాణ్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో భాజపా అగ్రనాయకులతో భేటీల మీద భేటీలు కావడంతో ఏపీ రాజకీయాల్లో హీటెక్కుతోంది. వైసీపీ ఏకంగా వచ్చే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తమ పార్టీ నుంచి నలుగురికి కేంద్ర మంత్రులు కట్టబెట్టబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనితో ఈ విషయం కాస్తా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది.
ఈ ప్రచారంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... "జగన్ రెడ్డి గారు ఎన్డీఏతో పొత్తు పెట్టుకుంటున్నట్లు నాకు సమాచారం ఏమీ లేదు. ఒకవేళ అలాంటిది ఏమయినా వుంటే తనకు భాజపా నుంచి ఫోన్ వచ్చి వుండేది. అలాంటిదేమీ లేదు. ఇదంతా ఏదో గేమ్ తప్ప మరేమీ కాదు.
వాళ్లేదో ప్రచారం చేసుకుంటున్నారు కానీ భాజపా నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదు. పొత్తు వున్నదంటూ నమ్మి ప్రధాని మోదీ, అమిత్ షాలను అపార్థం చేసుకోవద్దు. వాళ్ల తరపున నేను చెపుతున్నా." అంటూ వెల్లడించారు.
