1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Tanishq ADVT controversy fab india sabyasachi

సబ్యసాచితో సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? ప్రకటనపై ట్రోల్స్...

Tanishq
గతేడాది దీపావళి ప్రకటన కారణంగా టాటా గ్రూప్ నగల బ్రాండ్ తనిష్క్ వివాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. తనిష్క్‌ను బహిష్కరించాలని ట్రోలర్లు చేశారు. తనిష్క్ హిందూ వ్యతిరేక ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. అయితే, వివాదం ముదిరినప్పుడు, తనిష్క్ ప్రకటనను ఉపసంహరించుకున్నారు.
 
 
దీని తర్వాత ఇటీవల ఫ్యాబ్ ఇండియాపై వివాదం నెలకొంది. దీపావళి పండుగను 'జష్న్-ఎ-రివాజ్' అని పిలువడం ద్వారా ఫ్యాబ్ ఇండియా తన దుస్తులను ప్రమోట్ చేసింది. హిందువుల దీపావళి పండుగకు జష్న్-ఇ రివాజ్ అనే ఉర్దూ పేరు పెట్టడంలో అర్థం ఏంటనే విమర్శించారు. ఈ వివాదం తర్వాత, ఫ్యాబ్ ఇండియా కూడా సోషల్ మీడియా నుండి తన ప్రకటనను తీసివేయవలసి వచ్చింది.
 
 
ఇప్పుడు మరోసారి ఓ ప్రకటనపై దుమారం రేగింది. ఇప్పుడు ఫ్యాషన్- జ్యువెలరీ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ యొక్క కొత్త ప్రకటన ప్రచారం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమె సోషల్ మీడియా హ్యాండిల్‌లో మంగళసూత్ర ప్రకటనకు సంబంధించిన కొన్ని మోడల్స్ చిత్రాలు ఉన్నాయి. చాలామంది ఈ ఫోటోలను అశ్లీలంగా, నగ్నంగా పేర్కొంటూ వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో ఈ ప్రకటనకు వ్యతిరేకంగా ప్రజలు రాస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
తర్వాతి కథనం
నవంబరు 4న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు