గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2019 (16:18 IST)

ఆ జంట పోస్ట్ వెడ్డింగ్ ఫోటోలు వైరల్.. బురదలో దొర్లుతూ..

ప్రతి జంట తమ వివాహ వేడుకను సేవ్ చేయాలని కోరుకుంటుంది. ఆ సమయంలో తీసే ఫోటోలను చాలాకాలం పాటు భద్రపరచాలనుకుంటుంది. ఇందుకోసం ఫోటో షూట్స్ చేస్తుంటుంది. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్‌ల హవా కొనసాగుతోంది. సెలెబ్రిటీల తరహాలో ప్రస్తుతం చాలామంది తమ వివాహ ఫోటోలను వివిధ రకాలుగా ఫోజులిచ్చి తీసుకుంటున్నారు. 
 
తాజాగా ఓ కేరళ జంట పోస్టు చేసిన పోస్టు వెడ్డింగ్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వారి వివాహానికి తీసే ఫోటో షూట్ చిరస్మరణీయమైనదిగా వుండాలనుకున్నారు. ఈ క్రమంలో ఆ జంట తీసిన ఫోటోలు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. 


ఈ షూట్‌కు నాయకత్వం వహించిన ఫోటోగ్రాఫర్ బిను సీన్స్ ఫోటోగ్రఫి, ఈ చిత్రాలను "మడ్ లవ్,  పోస్ట్ వెడ్డింగ్ జోస్, అనిషా 994648498 ఫోటోగ్రఫి: బిను సీన్స్ అని క్యాప్షన్ పెట్టారు. ఆపై హ్యాష్‌ట్యాగ్ అనుసరించింది.
 
ఈ ఫోటోషూట్‌లో పాల్గొన్న జంట జోస్, అనిషా. వారు ఉత్తమ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను మీరూ ఓ లుక్కేయండి.