1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
  4. Sensex Crashes Over 850 Points, Sinks Below 27000

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. చరిత్రలో ఎనిమిదో అతిపెద్దది!

Sensex Crashes Over 850 Points
ముంబై స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఒకే రోజు ఏకంగా 800 పాయింట్ల మేరకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్‌లో మంగళవారం ఈ పరిస్థితి నెలకొంది. గత 2008 అక్టోబరు 24వ తేదీ తర్వాత ఇంత పెద్దఎత్తున మార్కెట్లు కుప్పకూలడం ఇదే తొలిసారి. మొత్తం సెన్సెక్స్ చరిత్రలో ఇది ఎనిమిదో అతిపెద్ద పతనమని మార్కెట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 
 
కాగా, మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ సూచీ ఏకంగా 854.86 పాయింట్ల మేరకు నష్టపోయి 26,987.46 వద్ద స్థిరపడగా, నిఫ్టీ కూడా 251.05 పాయింట్లు కోల్పోయి 8,127.35 వద్ద ముగిసింది. ఈ పతనంలో కూడా కేవలం హెచ్‌యూఎల్ కంపెనీ షేర్ మాత్రమే లాభాలను చవిచూడగా, ఆయిల్ కంపెనీల షేర్లన్నీ తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నరు. 
About Writer
PNR